calender_icon.png 21 November, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ పై కేసు నమోదు చేయాలి

21-11-2025 04:54:21 PM

హనుమకొండ,(విజయక్రాంతి): బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, స్వేరో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కేసు నమోదు చేయాలని ఎల్తూరి సాయికుమార్ డిమాండ్ చేశారు. స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ గురువారం రోజున హనుమకొండ జిల్లాలో మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయపరంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ పథకాల వైఫల్యాలను ఎండగడుతూ ఆరోపించడం జరిగింది.

దీనికి ప్రతి ఆరోపణగా యూత్ కాంగ్రెస్ నాయకులు తోట పవన్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ని వ్యక్తిగతంగా గుండు మీద బొచ్చు లేదు, గుండు లోపల మెదడు లేదు అంటూ పలికిన మాటలను యావత్ తెలంగాణ రాష్ట్ర స్వేరోస్ ,అభిమానులు ,విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందున తోట పవన్ పై కేసు నమోదు చేయాలని, హనుమకొండ ఎస్ హెచ్ ఓ ఇంచార్జ్ ఎస్ఐ సతీష్ కి పిటిషన్ ఇవ్వడం జరిగింది.