21-11-2025 04:57:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శుక్రవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలు పెట్రో కార్ సిబ్బంది నారిశక్తి పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహించి రోడ్డు నిబంధనలు పాటించని వాహనాలపై జరినామా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి ప్రజలకు తాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఎలిమెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హై స్పీడ్ ను నియంత్రించుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.