20-02-2026 12:22:22 AM
ధర్మపురి,ఫిబ్రవరి19 (విజయక్రాంతి): గ్రామీణ యువతను ఏకం చేసి వారిని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా మై భారత్ (మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ )ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమాన్ని 5రోజులలో 3 మాడలాల్లో ధర్మపురి, వెల్గటూర్, ఎండపల్లి 50 గ్రామా ల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా మండలాల్లో యువజన నాయకులకు యూత్ అవ గహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
చైల్ మ్యారేజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భూమేష్ మా ట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న యువజన సంఘాలను ఏర్పాటు చేసి వారిని మై భారత్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విభాగలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మై భా రత్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో గ్రామీణ యువత చురుగ్గా పాల్గొనే అవకాశం కలుగుతుందని అన్నారు. కార్యక్రమం లో ప్రోగ్రాం ఆర్గనైజర్ మారం గణేష్ యూ త్ మెంబెర్స్ ఆదిత్య , హరీష్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.