13-07-2025 05:41:59 PM
ఆషాఢమాసం బోనాలు ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం రేవంత్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.