కన్నడ నటుడుకు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు

16-09-2026 | 06:37pm

సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనంత్ నాగ్‌కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను.. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారికంగా వెల్లడించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో అనంత్ నాగ్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపారు. అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో, ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హులని ప్రధాని పేర్కొన్నారు.

1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత్ నాగ్‌ (అనంత్ నాగర్‌కట్టె) తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో 250కి పైగా కన్నడ చిత్రాలే ఉన్నాయి. ఆయన కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపైనే కాకుండా, ఆర్.కె. నారాయణ్ కథల ఆధారంగా దూరదర్శన్‌లో ప్రసారమైన 'మాల్గుడి డేస్' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తన నటనకుగాను ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు అందుకున్న అనంత్ నాగ్‌ను, గత ఏడాది (2025) భారత ప్రభుత్వం దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేస్తున్న 

మరిన్ని వార్తలు