బీజేపీ బండారం బయటపడింది

05-05-2024 02:17:07 AM

కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్

హైదరాబాద్,ఏప్రిల్4 ( విజయక్రాంతి): బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని లౌకికవాదం పదాన్ని తొలగిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ వ్యాఖ్యలతో ఆ పార్టీ బండారం బయటపడిందని, దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. దుష్యంత్ మాటలతో 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మర్చాలనే కుట్ర బీజేపీ చేయబోతుందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇకనైనా దేశ ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే సెక్యులర్ భావాలతో పని చేస్తుందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ నామినేషన్ వేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘డరో మాత్, భాగో మత్’ అన్నారని, ఆయన మాటాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని తెలిపారు.