కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
వరంగల్, మే 4(విజయక్రాంతి): ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగర అభివృద్ధికి కృషి చేస్తానని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. మడికొండలో శనివారం నిర్వహించిన కాజీపేట మండల, బూత్ కమిటీల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగరంలో అండర్ డ్రైనేజీ, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు పాటుపడతానని తెలిపారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగు పరుస్తానని, వరంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా, ఐటీ హబ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న బీజేపీని ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం కాజీపేట, రహ్మత్నగర్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, దొమ్మటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.