calender_icon.png 7 June, 2025 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టురట్టు

04-06-2025 12:17:03 AM

 - ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు  

- వివరాలు వెల్లడించిన శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్  

 రాజేంద్రనగర్, జూన్3: నకిలీ సర్టిఫికెట్ల ద్వారా విదేశాల కు పంపిస్తున్న ఓ వ్యక్తితో పాటు మరో విద్యార్థిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు త రలించారు. కేసు వివరాలను మంగళవారం శంషాబాద్ లోని తన కార్యాలయంలో ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియాకు వెల్లడించారు.

ఈనెల 1వ తేదీన పకీరు గోపాల్ రెడ్డి అనే విద్యార్థిని అమెరికాలోని డల్లాస్ ఏర్పోర్ట్ అధికారులు డిపోర్ట్ చేయడం తో అతడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారుల విచారణలో అతడు తన అకాడమిక్ లో మార్కులు తక్కువగా ఉండటంతో నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని అమెరికాకు వెళ్లినట్లు తెలిపాడు. దీంతో ఇమి గ్రేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

ఇదిలా ఉండగా బి.యన్.రెడ్డి నగర్ లోని టీచర్స్ కాలనీలో ఉండే కాతోజు అశోక్ ధనలక్ష్మి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ నడిపిస్తున్నాడు. అతడు కే రళకు చెందిన ఓ వ్యక్తి ద్వారా నకిలీ సర్టిఫికెట్లు పొందుతూ అ కాడమిక్ ఇయర్లో తక్కువ మార్కులు ఉండి విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కోరిక ఉన్న విద్యార్థులకు గాలం వేసి వారి ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు లాగుతూ నకిలీ సర్టిఫికె ట్లు అంటగడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలోనే పకీరు గోపాల్ రెడ్డి 2021 ఆగస్టులో కాతోజు అ శోక్ ను కలవగా 80 వేల రూపాయలు తీసుకుని తమిళనాడుకు చెందిన మధురై కామరాజ్ యూనివర్సిటీ కి సంబంధించి బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చాడు. వాటి సహకారంతో గోపాల్‌రెడ్డికి అమెరికాలోని వెబ్ స్టర్ యూనివర్సి టీలో అడ్మిషన్ వచ్చింది. అతడు 22 లక్షల ఫీజు అక్కడ చెల్లించాడు. అనంతరం ఐదు నెలల క్రితం తిరిగి ఇండియాకు వచ్చి తిరుగు ప్రయాణంలో డలాస్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో అధికారులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

దీంతో అధికారులు అతడిని డిపోర్ట్ చేశారు. శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేసి ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఏ1 నిందితుడైన కాతోజు అశోక్ నుంచి మధురై కామరాజు యూనివర్సిటీ కి సంబంధించి 13 వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ మార్కుల పత్రాలను, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నలుగురు వ్యక్తుల పేర్లతో ఉన్న నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు పది లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.  ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ బాలరాజు తదితరులుపాల్గొన్నారు.