calender_icon.png 7 June, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిహేను మంది గ్రామస్థులకు జైలుశిక్ష

04-06-2025 12:16:45 AM

నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్ సంచలన తీర్పు

నిజామాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన కొలిప్యాక గ్రామ జన సంఘం సభ్యులు మేకల బబ్లు టమేకల మహేంద్ర, మేకల కవిత టభవాని, గొల్ల బొడ్డు తిరుపతి, మువ్వల పోషన్నటమూగల పోషన్న, రావుట్ల బక్కన్న, పాపి గంగాధర్ టగూండ్ల పాపి గంగాధర్, బొడ్డు నవీన్ టబొల్లి నవీన్, కలకాడి ముత్తేన్న టచాకలి ముత్తేన్న,

మాల చిన్న రాజన్న, టజంగం చిన్న రాజన్న, బొల్లి రంజిత్ టకోమటి రంజిత్, వడ్ల శ్రీకాంత్, దాసరి సురేందర్, ఆరెపల్లి ఇస్తారిటకుమ్మరి ఇస్తారి, వంకాయల గంగాధర్, తలారీ గంగాధర్ లకు ఇండియన్ పినల్ కోడ్, ఎస్. ఎస్టీ అత్యాచారాల చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టాల ప్రకారం వివిధ జైలుశిక్షలు విదిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు వె లువరించారు.

వివరాలు నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామానికి చెందిన ఆరోళ్ల రుక్మవ్వ లాక్ డౌన్ సమయంలో 22ఏప్రిల్, 2020 న తన భర్త, కుమారుడు, కూలీలతో కలిసి పొలంలోకి వెళ్లి గడ్డి ట్రాక్టర్ లో వేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గ్రామస్థులైన మేకల బబ్లు, మేకల భవాని ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్ ను ఆపి  అగ్గి పెడుతామని బెదిరించారు.ఈ విషయాలు గ్రామ జన సంఘం నాయకులైన తిరుపతి తదితరులు పంచాయతీ నిర్వహించి ఆరోళ్ల రుక్మవ్వ కు జరిమానా విధించారు. ఆ తదుపరి గ్రామ సాంఘిక బహిష్కరణ చేశారు. రుక్మవ్వ జక్రాన్ పల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.

పిర్యాదును అనుసరించి నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కుమార్ సమగ్ర నేర విచారణ నిర్వహించి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పదిహేను మంది సాక్షుల సాక్ష్యాలు నమోదు చేసిన కోర్టు, పదిహేను ధ్రువీకరించున్న పత్రాలు అధ్యయనం చేసి పదిహేను మంది ముద్దాయిలపై నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారిస్తూ శిక్షలను ఖరారు చేశారు.

పదిహేను మందికి ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్ 341(తప్పుడు నిర్భంధం )ప్రకారం నెల రోజుల జైలుశిక్ష ఐదు వందల రూపాయల జరిమానా,290(ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు)ప్రకారం రెండు వందల రూపాయల జరిమానా విధించారు.సెక్షన్ 384( దోపిడికి )ప్రకారం  సెక్షన్ మూడు సంవత్సరాల జైలుశిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా,506(నేర పూరిత బెదిరింపు) ప్రకారం రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా,పౌర హక్కుల రక్షణ చట్టం ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష వేయి రూపాయల జరిమానా విధించారు.

ముద్దాయిలు తిరుపతి, బక్కన్న, పాపి గంగాధర్, నవీన్, ముత్తేన్న, రంజిత్, శ్రీకాంత్, ఇస్తారి లకు ఎస్ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు.శిక్షలన్ని %%ఎకకాలంలోఅనుభవంచాలని జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు