04-06-2025 12:17:34 AM
సిరిసిల్ల, జూన్ 3 (విజయక్రాంతి): వేములవాడ ఆలయానికి చెందిన తిప్పాపూ ర్లోని గోశాలలో అనారోగ్యంతో ఉన్న 6 పశువులు మంగళవారం మృతిచెందాయని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటనలో తెలిపారు. అకాల వర్షాలు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 26 పశువులు చనిపోయినట్లు వెల్లడించారు.
గోశాలలో ఉన్న 1,300 పశువు లలో మంగళవారం మరో 4 పశువులు అనారోగ్యం పాలయ్యాయని, ప్రస్తుతం మొత్తం 14 పశువులు అనారోగ్యంతో బాధపడుతున్నాయని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ నుంచి వెటర్నరీ నిపుణుల వైద్య బృందం కోడెలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. చిన్న వయసు గల పశువులు, పెద్ద వయసు గల పశువులు ఒకేచోట ఉండటం వల్ల మరణాలు సంభవిస్తున్నట్లు నిపుణులు తెలిపా రని చెప్పారు.
వేములవాడ రాజన్న ఆలయ భక్తులు దేవాలయానికి తప్పనిసరిగా 1.1/2 సంవత్సరం కంటే ఎక్కువ వయసున్న కోడెలు మాత్రమే సమర్పించాలని ఆయన సూచించారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.