2 May, 2026 | 7:09 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

09-02-2025 05:27 PM

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం(Choutuppal Mandal) ఆరెగూడెంలో ఆదివారం ఘోరవిషాదం చోటుచేసుకుంది. ఓ తండ్రి మద్యం మత్తులో కుమారుడిని కొట్టిచంపిన విషాదం గ్రామంలో కలకలం రేపుతుంది. తాను చదువుతున్నా పాఠశాలలో శనివారం ఫేర్ వెల్ పార్టీ(Farewell Party)కి హజరు అయినా విద్యార్థి భాను, రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు కొపంతో చావబాదాడు.

తండ్రి కొట్టిన దెబ్బలతో 9వ తరగతి విద్యార్థి భాను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లడంతో, గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యలు వెల్లడించారు. మృతి చెందిన విద్యార్థి ని పోస్టుమార్టం లేకుండా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయడంతో, విషయం తెలుసుకున్నా పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కుటుంబ సభ్యులకు సర్దిజెప్పరు. అనంతరం మృతదేహన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణమైన తండ్రి సైదులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.