14 April, 2026 | 1:19 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

21-04-2025 12:36 AM

నాగారం, ఏప్రిల్ 20: నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం లోఈటూరు డెవలప్మెంట్ సొసైటీఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగాగత 25 సంవత్సరాలుగాపాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులను శాలువాలతో సత్కరించారు.సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం డా. బండి సాయన్న మాట్లాడుతూఈటూరు పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

గ్రామంలోని ప్రతి పిల్లవాడు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా వసతుల కల్పనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అభివృద్ధి పథంలో నడుస్తున్న పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పాఠశాలలో పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులకు గోల్ మెడలో అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుండు కిష్టయ్య ఎంఈఓ ప్రభాకర్ కే ఉప్పలయ్య కే బ్రహ్మచారి  సోమిరెడ్డి  దామోదర్ కన్నెబోయినరాముయాదవ్  యాదగిరి ఎల్లాచారి శ్రావణ్ కుమార్ గోపి పూలమ్మ సోమయ్య సతీష్ సురేష్ గణేష్ గిరి పాల్గొన్నారు