14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

హిందువులపై దాడిని ఖండిస్తూ నిరసన

21-04-2025 12:36 AM

హిందూ సంఘాలతో కలిసి బీజేపీ భారీ ర్యాలీ

పటాన్ చెరు, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడా, కిష్ణారెడ్డిపేట హిందూ సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు బీరంగూడ మండే మార్కెట్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తక్షణమే హిందువులకు రక్షణ కల్పిం చాలని, దాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించి తరిమికొట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలకు బాధ్యత వహిస్తూ తక్షణమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. హిందువులకు ఎలాంటి సమస్యలు వచ్చిన తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, అమీన్ పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, బీజేపీ నాయకులు రాజేందర్ గౌడ్, రాములు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాకేష్, వెంకటేష్, రాజు గౌడ్, కుమార్ గౌడ్, వీరాంజనేయులు, హిందూ సం ఘాల ప్రతినిధులుపాల్గొన్నారు.