calender_icon.png 9 June, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ రవిచంద్రకు ఘన సన్మానం

09-06-2025 05:31:15 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతో పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఎంపీ రవిచంద్రను అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరణ సభ విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేశారని రవిచంద్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్న, గౌరవ అధ్యక్షుడు గుజ్జు నూరి బాబురావు, బేతమల్ల చంద్రయ్య, గుజ్జునూరు వెంకన్న, తమ్మడపల్లి యాదగిరి, కోశాధికారి గోపందాస్ కృష్ణ పాల్గొన్నారు.