21-06-2025 04:55:20 PM
అయిజ: యోగా భారతవానికి దక్కిన గొప్ప గౌరవమని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా పట్టణంలోని వీఆర్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగ కార్యక్రమంకు స్థానిక నాయకులతో కలిసి అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... యోగా, మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమై పోయింది. యోగాసనాల ప్రాధాన్యతని బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహిస్తున్నామన్నారు. పురాతన కాలం నుంచి యోగాని ఆచరించేవారని ఈ యోగాసనాలు గొప్పదనం తెలుసు కాబట్టే, విదేశీయులు సైతం యోగాసనాలను ఆచరిస్తున్నారని అయన వివరించారు.