21-06-2025 04:53:40 PM
ఆయుష్ వైద్యాధికారి నీరజ...
మందమర్రి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుని ప్రతిరోజు యోగ సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి నీరజ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. యోగా సాధన ద్వారా శారీరక, మానసిక వత్తిడులు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అనంతరం యోగాసనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సుమతి, యోగ మాస్టర్ కొంపెల్లి రమేష్ కుమార్, బిజెపి నాయకులు రామటింకి దుర్గరాజు, చంద్రమౌళి, కోలేటి శివ, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.