21-06-2025 04:57:18 PM
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలోని మోడల్ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్కూల్ గ్రౌండ్ లో ప్రముఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రమ, పీడీ ఆంజనేయులు ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రిన్సిపాల్ చిన్నప రెడ్డి మాట్లాడుతూ.. యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. డిప్రెషన్, ఆందోళన, అలసట లాంటి సమస్యలు తగ్గడంతో పాటు మానసికంగా దృఢంగా తయారవుతామన్నారు.
తద్వారా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. పీడీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగాకు కేటాయిస్తే... ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. యోగాకు వయస్సు అడ్డంకి కాదని, ఏ వయస్సు వారైనా యోగా చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ కుమార్, జగదీష్ , విద్యార్థులు పాల్గొన్నారు.