calender_icon.png 2 June, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదల కోసం “మహా ప్రస్థానం”

31-05-2025 10:02:51 PM

మంత్రి ధనసరి అనసూయ..

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో నిర్మించిన మహాప్రస్థానం(వైకుంఠధామం) నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(Minister Danasari Anasuya)(సీతక్క) అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలో గల మహాప్రస్థానంను మంచిర్యాల నియోజకవర్గ శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, రాజర్షి షా, అభిలాష అభినవ్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జి.సి.సి. చైర్మన్ కొట్నాక తిరుపతిలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచిర్యాల పట్టణంలో నిర్మించిన మహాప్రస్థానం రాష్ట్రంలోనే అత్యున్నతంగా ఉందని, ప్రజల కొరకు నిర్మించిన మహాప్రస్థానంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.