17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

20-04-2025 07:39 PM

31 ఏళ్ల తర్వాత జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కలయిక..

పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఆనాటి విద్యార్థులు నాడు తాము చదువుకున్న పాఠశాలను చూసి తీపిగుర్తులను నెమరు వేసుకున్నారు. సుమారు 31 సంవత్సరాల తరువాత వారంతా కలిసి తమ ఉపాధ్యాయులను, తోటి మిత్రులను కలుసుకొని సందడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ జడ్పీహెచ్ఎస్ 1993-94 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు... ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని సందడిగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాలు చేసి, ఆట పాటలతో రోజంతా సరదాగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పూర్వ ఉపాధ్యాయులు కాల్వ జనార్దన్ రెడ్డి, చంద్రయ్య, సీతారామయ్య, రాజేందరప్రసాద్, మల్లారెడ్డి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.