24 June, 2026 | 12:25 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి

15-06-2024 12:10 AM

వికారాబాద్, జూన్-14(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం అమ్రాద్ కలాన్ గ్రామంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనంతో పాటు వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతిచెందాడు. మోమిన్‌పేట్ మండలం అమ్రాద్ కలాన్ గ్రామానికి చెందిన మైతాబ్ ఖాన్(35) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్త సదాశివాపేటకు వెళ్లిన మైతాబ్‌ఖాన్ రాత్రి 10గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరాడు. అప్పటికే భారీ వర్షం కురువడంతో అమ్రాద్ కలాన్ గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటటేక కొందరు అక్కడే వేచి ఉండగా.. మైతాబ్ ఖాన్ మాత్రం ద్విచక్రవాహనం దాటుతుందనే నమ్మకంతో ముందుకు కదిలాడు.

దీంతో అందరూ చూస్తుండగానే నీటిలో వాహనంతో పాటు కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్న కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి 2గంటల వరకు వాగులో గాలించినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో మైతాబ్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.