15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లను ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

19-12-2025 12:13 AM

చిట్యాల, డిసెంబర్ 18 :  చిట్యాల మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలను అందించాలని కోరుతూ టియుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజాన్ని నమ్ముకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు మాత్రం హామీలు ఇస్తున్నారు తప్పా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బయన్న అన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలోనైనా తమకు ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు)  యూనియన్ మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు.