29-05-2025 04:25:15 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డు(Gaddar Telangana Film Award) జ్యూరీ కమిటీ లో ఆసిఫాబాద్ మండలం జెండా గుడా గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మసాజ్ లక్ష్మీనారాయణను ప్రభుత్వం ఎంపిక చేసింది. హైదరాబాదులో గురువారం సెలెక్ట్ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. 20 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తనను ప్రభుత్వం గుర్తించి కమిటీలో స్థానం కల్పించినందుకు లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కమిటీ నియామకం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతం నుండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు సామాజిక దృక్పథంతో పలు కార్యక్రమాలను చేపట్టిన లక్ష్మీనారాయణ ఫిలిం అవార్డు జ్యూరీ కమిటీ సభ్యుడిగా నియామకం అవడంపై జిల్లాలోని జర్నలిస్టులు, స్నేహితులు ,బంధువులు, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.