29-05-2025 02:59:56 PM
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP Goshamahal MLA Raja Singh) సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha Kalvakuntla) సొంత పార్టీపై గురువారం చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడింది నిజమే అన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారని చెప్పారు. బీజేపీ(Bharatiya Janata Party) అభ్యర్థులు ఎక్కడ పోటీచేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ ఇదే జరిగింది.. అందుకే బీజేపీ నష్టపోయిందని రాజాసింగ్ తెలిపారు.
ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు(BJP leaders) కుమ్మక్కయ్యారని తమ పార్టీ నేతలపై విమర్శలు సంధించారు. ఇతర పార్టీలతో తమ నేతల కుమ్మక్కుతోనే తెలంగాణలో బీజేపీ పార్టీ నష్టపోయిందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. వాస్తవానికి బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సిందన్న రాజాసింగ్(Raja Singh) ఇతర పార్టీల నేతలతో బీజేపీ నేతలు కుమ్మక్కు అందరికీ తెలుసన్నారు. కుమ్మక్కు విషయాలు బహిరంగంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తారని తెలిపారు. సస్పెన్షన్ భయంతో కార్యకర్తలు, నేతలు నోరు విప్పట్లేదని రాజాసింగ్ కుండ బద్దలు కొట్టారు.