9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం

12-10-2024 01:02 AM

గూడ్స్ రైలును ఢీకొట్టిన భాగమతి ఎక్స్‌ప్రెస్

పట్టాలు తప్పిన 13 బోగీలు, 2 బోగీల్లో మంటలు

పలువురు ప్రయాణికులకు గాయాలు 

చెన్నై, అక్టోబర్ 11: తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని కవరైపెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్ నుంచి దర్భంగా వెళుతున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వైద్యులు, ఆంబులెన్సులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని తెలిపారు. ప్రయాణికులను తరలించేందుకు వీలుగా బస్సులు, ఇతర వాహనాలు ఏర్పా టు చేశారు.

పొన్నేరి రైల్వేస్టేషన్ దాటి కవరైపెట్టు స్టేషన్ పరిధిలోకి ప్రవేశిస్తున్న సమయంలో భారీ కుదుపు వచ్చిందని, దీంతో గ్రీన్ సిగ్నల్ ప్రకారం మెయిన్‌లైన్‌లోకి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్‌లోకి ప్రవేశించి గూడ్స్ రైలును ఢీకొట్టిందని దక్షిణ రైల్వే ప్రతినిధి తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో రైలు 110 కి.మీ వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూ రు, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయా యి. పలు రైళ్లను ఇతర రూట్లకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.