calender_icon.png 9 May, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుల తడకల లెక్కలపై సమగ్ర విచారణ జరపాలి

07-05-2025 12:00:00 AM

  1. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తీరుతో రైతులకు నష్టం

పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజం

ఆదిలాబాద్, మే 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే హస్తంతో ప్రైవేట్ డీలర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసీన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పత్తి రైతులు సాగు చేసిన పత్తితో 49 లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి అయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నామని అన్నారు. ఇందులో 41 లక్షల బేళ్లు సీసీఐ ద్వారా ఖరీదు చేసినట్లు చెబుతున్నారని, మరో ఎనిమిది లక్షల బేళ్లు ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలు ఉన్నాయన్నారు.

అయితే సీసీఐ కేవలం ఆరున్నర లక్షల మంది రైతుల నుండే పత్తి కొనుగోలు చేసినట్లు ఉందన్నారు. తాను గతంలోనే హెచ్చరించిన విధంగా స్థానిక ఎమ్మెల్యే సైతం అందుకు సహకరించారని, తప్పుల తడకగా ఉన్న లెక్కలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు అశోక్ స్వామి, అడప తిరుపతి, నరేష్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.