17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నిధులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలి

31-10-2025 12:43 AM

జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

వనపర్తి, అక్టోబర్ 30 ( విజయక్రాంతి ) : వనపర్తి ఎమ్మెల్యే ప్రతిసారి అభివృద్ధి పనులకు వే యికోట్లు నిధుల తెచ్చామని చెప్తున్నారని నిధులకు సంబందించిన శ్వేత పత్రం విడుదల చేయాలని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ లు అన్నారు. గు రువారం జిల్లా కేంద్రం లోని మాజీ మంత్రి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వనపర్తి జిల్లా కేంద్రంలోకాంగ్రెస్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి పనులు జరగలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందని అంటున్నారన్నారు.

మున్సిపాలిటీలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిధులు తెచ్చి అభివృద్ధి చే స్తున్నాం అంటున్నారని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యేనే, మున్సిపాలిటీలో జరిగే టియు ఎఫ్ ఐ డి సి అమృత్ స్కీం టెండర్లు గత ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. రోడ్డు వెడల్పుల విషయం లో తాము అధికారంలో ఉన్న సమయంలో గతంలో ఎమ్మార్వో ఆఫీస్ నుండి రామాలయం వరకు అన్ని ఇళ్లను తొలగించామని కాంగ్రెస్ వాళ్లు దమ్ముంటే ఎమ్మార్వో ఆఫీస్ నుండి పాలిటెక్నిక్ వరకు ఇళ్ళను తొలిగించి రోడ్ల విస్తరణ చేయాలన్నారు.

మెయింటెనెన్స్ పనులు చేస్తూ రోడ్ల విస్తరణ జరుగుతుందని అబూత కల్పన కల్పించవద్దని, గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ,టౌన్ హాళ్లను కట్టించడం జరిగిందన్నారు. పార్టీలు మారినంత మాత్రాన జీవోలు మారవని వారు హితువు పలికారు . ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.