12-06-2025 10:00:51 PM
ఒకరికి గాయాలు..
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) శంకరపట్నం మండలం కాచాపూర్ మూలమలుపు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన తాడికొండ పుష్పలీల, రామస్వామిలు హుజురాబాద్ లో ఎస్సార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బంధువులను చూడడానికి వస్తున్న క్రమంలో కాచాపూర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. ఈ ప్రమాదంలో పుష్పలీల అక్కడికక్కడే మృతి చెందగా, తాటికొండ రామస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఏంజెమ్ కు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.