calender_icon.png 23 June, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

22-06-2025 10:24:45 PM

యాచారం సమీపంలో హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఘటన..

యాచారం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్ స్టేషన్(Yacharam Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనాథ్(18) తన బైక్‌పై స్నేహితులు రామాయణం మణిదీప్(18) శొంటి చరణ్(18) వైజాగ్ కాలనీకి వెళ్లారు. అక్కడి నుండి చింతపల్లి మండలంలోని తన అత్తగారు గ్రామమైన వింజమూరుకు వెళ్లి అక్కడ పడుకున్నారు.

ఆదివారం ఉదయం నిద్రలేచి వింజమూరు నుండి జిల్లాలగూడకు తన పల్సర్ బైక్ పై తిరిగి వస్తున్నారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో  యాచారం సమీపంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగానే కండిషన్ లేని బైక్ చెట్టును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కింద పడిపోయారు. శ్రీనాథ్ తలకు బలంగా తగిలి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.