22-06-2025 10:30:16 PM
చిలుకూరు: చిలుకూరు మండలం(Chilukuru Mandal) కొండాపురం గ్రామంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా మేరిగా మోహన్, ఎమ్మెస్పి అధ్యక్షులుగా మేరిగా వీరబాబులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చిలుకూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మల్లెపంగు సూరిబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ... పద్మశ్రీ, మందకృష్ణ మాదిగ, ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో మండలాలలో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, ఈ కమిటీలు పతిష్టంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని, జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జెండా ఎగరవేసి ఒక పండుగల జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మండల అధికార ప్రతినిధి మాతంగి వీరస్వామి, ఎంఎస్పి మండల కోశాధికారి మేరిగా రామారావు, రంగయ్య, వీరబాబు, బాలరాజు, లక్ష్మీనారాయణ, చందు, సురేష్, యేసు, గణేష్, నరేష్, వినోద్, వీరబాబు, గోపి పాల్గొన్నారు.