calender_icon.png 14 June, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలి

13-06-2025 12:00:00 AM

పీసీసీ చీఫ్‌కు మున్నూరుకాపు సంఘం వినతి

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు సంఘం నాయకులు కోరారు. రాష్ట్రంలో ని 33 జిల్లాల నుంచి వచ్చిన మున్నూరుకాపు సంఘం నాయకులు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను గురువారం గాంధీభవన్‌లో కలిశారు.

ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏవైనా మున్నూరుకాపులకు మంత్రివర్గంలో చోటు ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మున్నూరుకాపు సంఘం నుంచి ఆది శ్రీనివాస్ ఉన్నారని, ఆయనకు అమాత్య పదవి ఇవ్వాలని కోరారు.