అభిషేక్ సింఘ్వీ, నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు
కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు
రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికలకు(Rajya Sabha elections) కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి(Abhishek Singhvi), వేం నరేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి సమర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నేతృత్వంలో నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్యసభలో రెండోసారి అవకాశం లభించడం తన అదృష్టమని అభిషేక్ సింఘ్వి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు అభిషేక్ మను సింఘ్వి కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) అగ్ర నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ సింఘ్వీ బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ఖరారు చేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆయనను కోరారు. అంతకుముందు, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా బీ ఫారాలను అందజేశారు.






