నామినేషన్ దాఖలు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు
రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
హైదరాబాద్: ఏఐసీసీ రాజ్యసభ సభ్యుల(Rajya Sabha candidates) పేర్లను విడుదల చేసింది. రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi), వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి(Election Officer Upender Reddy) నామినేషన్ పత్రాలు అందించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రం(Telangana State) నుంచి అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారయ్యారు. ఇద్దరు నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అభిషేక్ సింఘ్వీ పార్టీ హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అవకాశం ఇచ్చిన ఏఐసీసీ(All India Congress Committee) పెద్దలు, మల్లికార్జున ఖర్గేకు వేం నరేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర నాయకత్వం, మంత్రివర్గానికి కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యసభ అవకాశం పార్టీ ఆశీర్వాదంగా భావిస్తామని నరేందర్ రెడ్డి వెల్లడించారు.




