9 May, 2026 | 5:32 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

హిమాలయాల్లో అఖండ రెక్కీ

02-03-2025 12:43 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ కోసం నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా. సంయుక్త హీరోయిన్ కాగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచం ద్ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన ఈ లొకేషన్లను అన్వేషిస్తున్నారని మూవీ యూనిట్ చెబుతోంది. ఈ సన్నివేశాలు చిత్రంలో మెయిన్ హైలైట్ కానున్నాయని వారు పేర్కొన్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: సీ రాంప్రసాద్, సంతోష్ డీ; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు; ఫైట్స్: రామ్-లక్ష్మణ్.