ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
03-03-2026 01:21 AM
కుత్బుల్లాపూర్లో పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
కుత్బుల్లాపూర్, మార్చి 2 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యా లయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ విషయంలో జూనియర్ అసిస్టెంట్ గణేష్ బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.
అందులో భాగంగా మొదట రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.15 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.




