31 August, 2026 | 4:18 PM

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

31-08-2026 03:02 PM

 బోథ్. ఆగస్టు 31 (విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని నోడల్ అధికారి ఎంపీడీవో రత్నాకర్ రావు తెలిపారు. రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. దరఖాస్తులు పరిశీలించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.