16-07-2025 12:13:00 AM
ఎల్డియం రామ్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, జులై 15 ,(విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏడాదికి రూ 20 కే రెండు లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం రామిరెడ్డి తెలిపారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామ నికి చెందిన బానోతు జైత్రం ,కునుషోత హత్తి రామ్ లు ఇటీవల మరణించారు.
వారి నా మినీలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన పధకం క్రింద రూ 2 లక్షల చెక్కులను ఎల్డియం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్ ఆఫీసర్ పృథ్వీరాజు , అశోక్ చక్రవర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్. డి. ఎం. మాట్లాడుతూ పి ఎం జె జె బి వై, పి ఎం ఎస్ బి వై పథకాలు కేం ద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలన్నారు. కేవలం సంవత్సరానికి రూ 436 లతో జీవిత బీమా, రూ 20 లతో ప్రమాద భీమా పొందవచ్చని తెలిపారు.
అన్ని బ్యాంక్ శాఖలు, పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పథకం పొందవచ్చని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ లో అవగాహన, ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో విడ్స్ స్వచంద సంస్థ సీసీ నాగరాజు, కౌన్సిలర్స్ నవీన్, పవన్ కుమార్, కళ్యాణి, సెర్ఫ్ సిసి శిరీష, బ్యాంక్ మిత్ర చందులాల్, వివోఏలీలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి. యస్.పి. జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ మరియు సి.యస్.పిలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.