15 March, 2026 | 1:26 PM

హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాల ఎదుట ఆందోళన

05-11-2024 11:39 AM

న్యాయం చేయాలని మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యుల డిమాండ్ 

ఎల్బీనగర్: హయత్ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గేట్ మీద పడడంతో ఫస్ట్ క్లాస్ విద్యార్థి అజయ్ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని మంగళవారం పాఠశాల ఎదుట విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన చేపట్టారు. వీరికి కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, బీజేపీ నాయకుల మద్దతు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి 4 లక్షల ఎక్స్ గ్రేషియా, ప్రభుత్వంచే డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పియడం జరుగుతుందని డిఈఓ సుశీంధర్ రావు వెల్లడించారు.