కాంగ్రెస్‌లో చేరికలకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్

26-04-2024 12:55:20 AM

l పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకోవాలని ఆదేశాలు

l జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్ పార్టీలో చేరిక

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి):  కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎవరు ముందుకు వచ్చినా వారిని చేర్చుకోవాలని టీపీసీసీ నేతలను ఏఐసీసీ ఆదేశించింది. కొత్తవారిని చూసి పాత నాయకులు అసంతృప్తికి గురికావొద్దని, అందరూ కలిసి పనిచేయాలని సూచించినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కోదండరెడ్డి వెల్లడించారు. గురువారం గాంధీభవన్‌లో వారి సమక్షంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్‌తో పాటు పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల వరకు పార్టీలో పనిచేసి ఎన్నికల సమయంలో కొందరు పార్టీ వీడారని, వారందరిని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని, బీఆర్‌ఎస్ నుంచి ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ కండువా కప్పాలని సూచించినట్లు తెలిపారు.