12-01-2025 12:00:00 AM
నేడు అలిశెట్టి ప్రభాకర్
జయంతి, వర్ధంతి
కుంచెని, లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవిత కు పుష్టి చేకూర్చి, అనేక అద్భుత కవితా పంక్తులతో విస్ఫోటనం సృష్టించిన అక్షర భాస్కరుడు అలిశెట్టి ప్రభాకర్. సమాజంలోని అమానవీయ పోకడలపైన, ప్రజావ్యతిరేక రాజకీయలపైనర ఏకోన్ముఖ ఉద్యమమే నడిపారు.
దుర్మార్గపు తీరుతెన్నులపై ధిక్కార కవితా స్ఫూర్తిని రగిలించారు. సామాజిక రుగ్మతలపై విప్లవ కిరణాలను ప్రసరింపచేసి, కష్టజీవి కన్నీటి చెమట చుక్క లను, జనుల నాడులను తదైక దూరదృష్టితో దర్శించి, బాధితుల పక్షాన నిలబడిన మహనీయుడు అలిశెట్టి.
1954 జనవరి 12న జగిత్యాలలో అలిశెట్టి చినరా జం, లక్ష్మి దంపతులకు జన్మించారు. యుక్తవయస్సు లోనే మొదట పత్రికలకు కవితలు రాశారు. సినీనటుల బొమ్మలు గీస్తూ ఆర్టిస్ట్గానూ ఎదిగారు. కుంచె బొమ్మ ల్నీ, కెమెరా ఫొటోల్నీ తన కవిత్వానికి ఆసరాగా చేసుకు న్నారు. తాను చెప్పే భావాలను దివిటీలుగా మార్చుకు న్నారు. కవితాక్షరాలకు సృజనాత్మకతను జోడించి సునాయాసంగా ప్రజలకు అర్థమయ్యే సులభశైలిలో నిర్మొహమాటంగా అనేక అసాధారణ ప్రయోగాలు జరిపారు. అలిశెట్టి వెలువరించిన కవితా సంకలనా లలో ‘ఎర్ర పావురాలు’, ‘మంటల జెండాలు’, ‘చుర కలు’, ‘రక్తరేఖ’, ‘ఎన్నికల ఎండమావి’, సంక్షోభ గీతం’, ‘సిటీలైఫ్’ వంటివి ఉన్నాయి. ఏ కవిత రాసిన దానిలో పరమార్థంతో కూడిన సత్యాలు నర్మగర్భంగా గోచరిస్తా యి. వాస్తవిక విషయాలు రాయడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కవిత్వాన్నే శ్వాసగా మలచుకున్నా రు. పాఠకుల మనసులను ప్రగతిశీల ఆలోచనా ధృక్పథంలోకి మళ్ళించగల నేర్పరి అలిశెట్టి. వర్తమాన కవిత్వానికి కాయినేజ్ పెంచిన కవివర్యులు. కవిత్వంతో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా టీబీ వ్యాధి ఒంటిని కబ ళిస్తున్నా లెక్క చేయలేదు. ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడని అలిశెట్టి దగ్గరి మిత్రులు చెబు తుంటారు. ఎన్నో అద్భుతమైన కవితలను కాగితంపై అక్షరాల ఉలితో చెక్కి చెదరనివ్వని ముద్రలా నిలిచిపోయారు.
అద్భుత ప్రయోగాలు ఎన్నెన్నో
అలిశెట్టి ప్రభాకర్ కవితల సంకలనాలలోని మచ్చు తునకలు కొన్ని: ‘గొంతు కోస్తే/ పాట ఆగిపోదు/ అది ముక్తకంఠం/ గొలుసు లేస్తే/ పోరు నిలిచిపోదు/ అది ప్రజాయుద్ధం’ అని ఒక కళాకారుడి మీద హత్యాయ త్నం జరిగినప్పుడు చలించి రాశారు. ‘భయం’ అనే కవి తలో ‘బాంబుని చూడగానే/ బెంబేలు పడితే/ అదెప్పు డూ /నీ గుండెల్లోనే పేలుతుంది’ అన్నారు.
‘తను శవ మై/ ఒకరికి వశమై/ తనువు పుండై/ ఒకడికి పండై/ ఎప్పుడూ ఎడారై/ ఎందరికో ఒయాసిస్సయి’ అని ఒక వేశ్యపై మానవీయకోణంలో రాసిన కవిత్వం సాహితీ లోకాన్ని కదిలించింది. ఇంత గొప్పగా ఏ కవీ చెప్పలే దని చిన్న పంక్తులతో అనంతభావాలతో కవితలను పేర్చడం ఒక్క అలిశెట్టి ప్రభాకరుడికే సాధ్యమని నిరూ పించిన తెలంగాణ అక్షర ఆయుధం.
మరో కవితలో ‘దేవుళ్ళు తమ గుళ్ళకి రాత్రిళ్ళంతా/ తాళాలు వేసుకుం టున్నారెందుకో/బహుశా మనుషుల మీద నమ్మకం పోయిందేమో..’ అని నిర్మొహమాటంగా చమక్కులను వ్యక్తపరిచారు. ‘నగరాల్లో అత్యధికంగా/ అత్యద్భుతంగా / ఆస్థిపంజరాల్ని చెక్కే/ ఉలి/ ఆకలి’ అని హైదరాబాద్ నగరంలో బతుకుకోసం వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురవుతూ కడుపు నింపుకోవడానికి అహర్నిశలు శ్రమించే పేదL మధ్య తరగతి దుస్థితిని కళ్లకు కట్టారు.
మరో కవితలో ‘గడియారం పెట్టుకున్న/ ప్రతి వాడూ/ పరిగెడుతున్న/ కాలాన్ని/ పట్టుకోలేడు’, ‘కుక్కలూ/ కుక్కరూ లేని/ ఇల్లే ఒకింత ప్రశాంతత’, ‘విద్యార్థుల ఎగుమతి/ నిరుద్యోగుల దిగుమతి/ చేయగల/ చదువు ల రేవులు/యూనివర్సిటీలు’ అంటూ ‘సిటీలైఫ్’ సంక లనంలో చెమక్కులు విసిరారు. ఇలా అనేక మినీ కవితా లు రాస్తూ, 1993లో తాను పుట్టిన తేదీనాడే (జనవరి 12న) కన్ను మూశారు. పదునైన కవిత్వ అక్షర సూరీడు గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన అమరుడు అలిశెట్టి!
డాక్టర్ పగిడిపల్లి సురేందర్