02-02-2026 12:13:33 AM
ముకరంపుర, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘అల్ఫోర్స్‘ చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఆయన వెంట వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, విఎన్ఆర్ ఫౌండేషన్ కార్యకర్తలు ఉన్నారు.