3 June, 2026 | 2:16 PM

పిల్లలందరినీ బడికి పంపించాలి

03-06-2026 01:43 PM

సర్పంచ్ బెండరే కృష్ణాజి

వాంకిడి, (విజయక్రాంతి) : పిల్లలందరినీ బడికి పంపించాలని బంబార సర్పంచ్ బెండరే కృష్ణాజి అన్నారు. బుధవారం బడిబాట కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ జాడే సంతోష్, ప్రధానోపాధ్యాయురాలతో కలిసి  ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి గ్రామంలో అవ గాహన ర్యాలీ చేపట్టారు. పాఠశాల వయసున్న ప్రతి ఒక్కరినీ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.