03-06-2025 12:17:11 AM
చదలవాడ సూరి ఆధ్వర్యంలో ఘనంగా చర్మకారుల ఆవిర్భావ దినోత్సవం
కొత్తగూడెం జూన్ 2 (విజయక్రాంతి): దళితబంధు పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఇస్తామన్న రూ 12 లక్షలు డప్పు కళాకారులకు, చర్మకారులకు మంజూరు చేయాలని కోరారు.
చర్మకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకృతి ఆశ్రమంలో చదలవాడ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అతిధులుగా హాజరైన చెప్పుల దుకాణాల నిర్వాహకులు, మేనేజర్ లు మాట్లాడు తు చర్మకారులకు అండగా ఉంటామన్నారు. దళిత సంఘ నాయకులు మాట్లాడుతు గడిచిన కొ న్నేళ్లుగా దళితులు సంక్షేమానికి, స్వయం ఉపాధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితబంధు స్థానంలో అమలు చేస్తామన్న అంబేద్కర్ అభయహస్తం రూ 12 లక్షలను చర్మకారులకు అందిస్తే దళితుల్లో నిరుద్యోగులైన యువతకు స్వయం ఉపాధి దొరుకుతుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రుణాలు మంజూరు చేసి డప్పుకళాకారులకు, చర్మకారులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.
ఈ సందర్బంగా అతిధులుగా వచ్చిన వారికి మెమెంటో లను అందిచారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి రాము, పిట్టల సతీష్, పెద్దపుడి నాగేంద్రబాబు, చదలవాడ సూర్య ప్రకాష్, ఇనపనూరు బాబు, ఆముదాల దుర్గాప్రసాద్, జైదా వెంకటేశ్వర్లు, చుట్టుగుల నాగరాజ్, అంబాల శ్రీనివాస్, చుట్టుగుల రాంబాబు, గడ్డ పార్ల శ్రీను, పెద్దపులి చంటి, దాసరి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.