03-06-2025 12:16:49 AM
ముషీరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ఘనంగా జరు పుకున్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ, భోలక్పూర్, గాంధీనగర్, ముషీరా బాద్, రాంనగర్, అడిక్మెట్ డివిజన్లో బిఆర్ఎస్ డివిజన్లో అధ్యక్షుల ఆధ్వర్యంలో జాతీ య జెండాను ఎగురవేసి కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం పేదలకు అన్నదాన కార్య క్రమం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముసగోపాల్ హాజరై మాట్లాడుతూ టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందితే రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఆరు డివిజన్ల అధ్యక్షులు వై శ్రీనివాసరావు, ఎం. రాకేష్ కుమార్, కొండా శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, వల్లాల శ్యామ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆర్. మోజస్, ఎన్ డి సాయి కృష్ణ, గొల్లగడ్డ రాజశేఖర్ గౌడ్, వి సుధాకర్ గుప్తా, రవి యాదవ్, మాధవ్, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, ఆర్. రాజేష్, రామచందర్, కిరణ్ కుమార్, శ్రీహరి, పాల్గొన్నారు.