03-06-2025 12:18:37 AM
జీహెచ్ఎంసీ ఆఫీసులో ఆవిర్భావ వేడుకల్లో మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసుల వందనం స్వీకరించి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, కమిషనర్ ఆర్వీ కర్ణన్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంద ర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు, కార్పొరేటర్లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు శుభాకాం క్షలు తెలిపారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి అందరం సమిష్టిగా అంకితభావంతో పని చేద్దామని, నగరాభివృ ద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మేయర్ కోరారు.
అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ శానిటేషన్, వెటర్నరీ, ఎంటమాలజి కార్మికులకు పీపీ ఈ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరిష్, రఘు ప్రసాద్, వేణుగోపాల్, సుభద్ర దేవి, నళిని పద్మావతి, గీతా రాధిక, యాదగిరి రావు, అశోక్ సామ్రాట్, సిసిపి శ్రీనివాస్, సిఈ సహదేవ్ రత్నాకర్, అడిషనల్ సిసిపి లు వెంకన్న, ప్రదీప్, ఈవిడిఎం అడిషనల్ ఎస్.పి శ్రీనివాస్, ఏ సి పి సుదర్శన్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, మహేష్ కులకర్ణి, సిటిఓ శ్రీనివాస్, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఓ.ఎస్ డి అనురాధ తదితరులు పాల్గొన్నారు.