1 July, 2026 | 11:19 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

లా అడ్మిషన్ల ఆలస్యంపై తేల్చేందుకు అమికస్ క్యూరీ

23-07-2024 01:32 AM

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): లా కోర్సు అడ్మిషన్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతున్నదని హైకోర్టు ప్రశ్నించింది. జాప్యంపై కారణాలు, అందుకు ఎవరు బాధ్యులో తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించింది. కోర్టుకు సహాయకారిగా వ్యవహరించాలని సీనియర్ అడ్వొకేట్ పీ శ్రీరఘురాంను నియమించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ అనిల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. లా అడ్మిషన్లు 2023 ఏడాదికి ఆలస్యం కావడంపై లాయర్ ఏ భాస్కర్‌రెడ్డి వేసిన పిల్‌ను బెంచ్ సోమవారం విచారించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్ అదేశ్వరశర్మ వాదిస్తూ లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ మేరకు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. కాలేజీలకు బార్ కౌన్సిల్ ఇస్తుందని తెలిపారు. అడ్మిషన్లను యూజీసీ పర్యవేక్షించాలని ఆయన చెప్పడాన్ని రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకించారు. తదుపరి విచారణను కోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది.