calender_icon.png 2 August, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

01-08-2025 01:17:12 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదగిరిగుట్ట జూలై 31 (విజయ క్రాంతి) : గురువారం రోజు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో గొర్రెలకు వేసే ఉచిత బ్లూటాంగ్ వ్యాక్సిన్ క్యాంపును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...తేది:29.07.2025 నుండి 08.08.2025 వరకు ప్రభుత్వం  ఉచితంగా  రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూతి వాపు వ్యాధి నివారణ టీకాల్లో బాగంగా వంగపల్లి గ్రామంలో గొర్రెల కాపరి అయిన కొమురయ్య కి సంబంధించిన గొర్రెలకు గురువారం వాక్సిన్ వేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

వర్షాకాలం కావడంతో మూగజీవాలకు వ్యాధులు ప్రబలకుండా కాపరులు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. పశువైద్య డాక్టర్లు సకాలంలో వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామాలలో క్యాంపులు నిర్వహించి సకాలంలో జీవాలకు టీకాలు వేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను గొంగడి, గొర్రె పిల్లతో సన్మానించిన గొర్రెల కాపరులు . జిల్లా పశువైద్యాధికారి మోతిలాల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.