22-06-2025 06:25:40 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో డిసిఎంస్ రైతు సేవా కేంద్రం ఆదివారం ప్రారంభించారు. డిసిఎంస్ రైతు సేవా కేంద్రాన్ని చంద్రవెల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్, బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్(Mandal Agriculture Officer Suddala Prem Kumar) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని చాకెపల్లి గ్రామంలో ఇదివరకే ఒక డిసిఎంస్ రైతు సేవా కేంద్రం ఉందన్నారు.
చంద్రవెల్లి గ్రామంలో మరో సెంటర్ అవసరం కావడంతో ఏర్పాటు చేశామన్నారు. రెండు కేంద్రాలతో మరింత మంది రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందనున్నాయని తెలిపారు. రైతులు DCMS రైతు సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్కూరి రాంచందర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ న్యాతరి స్వామి, రైతులు పాల్గొన్నారు.