8 May, 2026 | 4:30 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

సాంకేతిక పురోగతికి గీతం-పైటెక్ ఎంవోయూ

12-03-2025 01:43 AM

ఒప్పందాలపై సంతకాలు చేసిన రెండు సంస్థల ప్రతినిధులు

పటాన్ చెరు, మార్చి 11 : హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని పైటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ తో అధికారికంగా అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల కీలక ప్రతినిధులు- గీతం ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, పైటెక్ డైరెక్టర్-సేల్స్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ చీఫ్ మురగన్ రంగనాథన్ సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ 4.0’పై దృష్టి సారించే రెండు రోజుల విద్యార్థుల కార్యశాలను కూడా వారు ప్రారంభించారు. అరుణ్ కుమార్ తన ప్రసంగంలో, విద్యారంగం, పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యలో స్పష్టత, సాంకేతికత యొక్క ఆచరణాత్మక అనువర్తనాన్ని పెంచడానికి తాము చేతులు కలుపుతున్నట్టు చెప్పారు. వర్థమాన ఇంజనీర్లను ప్రోత్సహించడం, వారి వ్యవస్థాపక ప్రయత్నాలలో మద్దతు ఇవ్వడం తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక అవగాహన ఒప్పందమే కాదని, దీని ద్వారా విద్యార్థులను ఆవిష్కరణల వైపు నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి ఈ అవగాహనపై హర్షాన్ని వ్యక్తంచేశారు. ఇది కేవలం అధికారిక ఒప్పందం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో పాటు, విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు- అన్ని స్థాయిలలో దీనిని అమలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ భాగస్వామ్యం ఈఈసీఈ విభాగంలోనే కాకుండా గీతంలోని అన్ని విభాగాలలో పరిశోధన సంస్కృతిని మారుస్తుందని అభిలషించారు. బీ.టెక్. విద్యార్థులకు ప్రాజెక్టులు, ఎం.టెక్. విద్యార్థులకు పరిశోధనా పనిలో మద్దతు ఇవ్వడానికి పైటెక్ సిద్ధంగా ఉందని ప్రొఫెసర్ శాస్త్రి వెల్లడించారు.