29-09-2025 01:36:07 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సీఎం చంద్రబాబునాయుడు పరామర్శించారు.ఈ సందర ్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే ఎడతెరిపి లేకుండా వస్తున్న దగ్గు ఇబ్బంది పెడుతోందని పవన్ సీఎంకి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చంద్రబాబు పవన్కల్యాణ్కి సూచించారు.