21-06-2025 12:00:00 AM
ఈ నెల 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి) ః సివిల్స్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమవుతున్న తెలంగాణలోని అభ్యర్థులకు ఆర్థిక సమస్యలను తొలగించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనతో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్టు సీఎండీ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల విడుదలైన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తెలంగాణ అభ్యర్థులకు ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23 వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు.