20-06-2025 11:58:00 PM
ఉపాధ్యాయ కృషిని అభినందించిన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..
హైదరాబాద్ (విజయక్రాంతి): బడిబాట కార్యక్రమంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి(Teacher MLC Pingali Sripal Reddy) పేర్కొన్నారు. బడిబాటను విజయవంతం చేయడంలో పీఆర్టీయూటీఎస్ కృషిని ఆయన అభినందించారు. పీఆర్టీయూటీఎస్ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్రెడ్డితో కలిసి శుక్రవారం బడడిబాట కార్యక్రమంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ, ఆర్టిఫీషియెల్ ఇంటెలిజన్స్పై బోధనాంశాలు ప్రభుత్వ బడి స్థాయిని పెంచాయని శ్రీపాల్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను అన్ని జిల్లాల టీచర్ల నుంచి తీసుకొని వాటిని ప్రభుత్వానికి సూచనల రూపంలో ఓ నివేదికను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. తన పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా బడిబాట విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.